Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా: కేసీఆర్ మరో అంబేద్కర్‌గా మిగిలిపోతారు

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (13:19 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం అమలుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

దళితుల గుండెల్లో అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారు. దళిత బంధును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. దళితులందరూ సీఎం కేసీఆర్ అండగా నిలబడి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. ప్రతి ఊరు, ప్రతి వాడలో దళిత బంధు పథకంపై అవగాహన కల్పించేందుకు దండోరా వేయాలన్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి దరువు వేశారు. 
 
సీఎం కేసీఆర్‌పై విశ్వాసంతోనే బీజేపీకి రాజీనామా చేశాను అని మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. ఈ దేశంలో దళితులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. దళితులను గౌరవించాల్సిన అవసరం ఉంది. దళిత బంధు గురించి సీఎం కేసీఆర్ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారు.

దళిత బంధు కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం తప్ప దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టే ధైర్యం చేయలేదు. రైతుబంధు మాదిరిగా దళిత బంధును దళితుల ఖాతాల్లో వేస్తామని సీఎం కేసీఆర్ మాటిచ్చారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్న మొనగాడు కేసీఆర్ మాత్రమే అని నర్సింహులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments