Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కాంగ్రెస్ రెపరెపలు - ఇండియా టుడే - సీ ఓటర్ సర్వే

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (10:42 IST)
వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఇండియా టుడే సీఓటర్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటమి తప్పదని ఈ సర్వే హెచ్చరించింది. తాజాగా తెలంగాణా రాష్ట్రంలో జరిగిన సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగినప్పటికీ చివరకు కాంగ్రెస్ పైచేయి అవుతుందని తెలిపింది. 
 
మూడ్ ఆఫ్ నేషన్ పేరుతో నిర్వహించిన ఈ సంస్థ వెల్లడించిన సర్వే ప్రకారం.. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 7, బీఆర్ఎస్‌కు 5, బీజేపీకి 4. మజ్లిస్ పార్టీకి 1 సీటు దక్కనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమికి ఆంధ్రప్రదేశ్‌ కేవలం 2 శాతం ఓట్లే లభించినప్పటికీ తెలంగాణలో 98 శాతం ఓట్లు లభిస్తాయని సర్వేలో వెల్లడైంది.
 
బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ పార్టీకి కంటే 6 శాతం తక్కువగా 32 శాతం ఓట్లు. ఐదు సీట్లు లభిస్తాయని తెలిసింది. అలాగని బీజేపీని కూడా తక్కువ అంచనా వేయక్కర్లేదని.. ఆ పార్టీకి 23 శాతం ఓట్లతో 4 సీట్లు లభిస్తాయని సర్వేలో వెల్లడైంది. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 41.71 శాతం ఓట్లు రాగా 2024 నాటికి ఈ ఓట్లు దాదాపు పది శాతం తగ్గనున్నట్లు ఈ సర్వే అంచనా వేసింది. అదేసమయంలో కాంగ్రెస్ ఓట్ల శాతం 29.79 శాతం నుంచి 98 శాతానికి పెరగనున్నట్టు అంచనా వేయడం గమనార్హం. 
 
బీజేపీకి 2019లో 19.65 శాతం ఓట్లు రాగా. ఈసారి ఆ పార్టీ ఓట్లు దాదాపు నాలుగు శాతం మేర పెరుగుతాయని అంచనా. ఈ మూడు పార్టీల్లో బీఆర్ఎస్ తప్ప మిగతా రెండు పార్టీల ఓట్ల శాతం పెరగడం.. గులాబీ పార్టీకి ప్రజాబలం తగ్గుతున్నదనడానికి సంకేతంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్ని కలు మరో 8 నెలలు ఉండగానే ఈ పరిస్థితి ఉందంటే.. 2024 ఏప్రిల్, మే నాటికి పరిస్థితిలో మార్పు వచ్చి బీఆర్ఎస్ ఓట్ల శాతం మరింత తగ్గిపోయి, కాంగ్రెస్ మరింత పుంజుకునే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments