Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా టూర్‌‍కు రానున్న ప్రధాని మోడీ - మల్కాజిగిరిలో బహిరంగ సభ

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (10:16 IST)
మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెలాఖరులో రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన నల్లగొండ లేదా మల్కాజిగిరిలో ఏర్పాటు చేసే బహిరంగసభకు హాజరవుతారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వం అధినాయకత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ నెల 15న ఖమ్మంలో నిర్వహించతల పెట్టిన బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారని, ఈ నేపథ్యంలో కనీసం లక్ష మంది జనసమీకరణ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
 
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి, పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు నేతృత్వంలో పలువురు సీనియర్ నాయకులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గురువారం సమీక్షించారు. శుక్రవారం ఖమ్మం వెళ్లి పార్టీ స్థానిక నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. 
 
రాష్ట్రంలో చేరికలను పెంచి.. పార్టీని బలోపేతం చేసే క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో 15వ తేదీన బహిరంగసభ నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా బండి సంజయ్ శుక్రవారం ఏర్పాట్లపై సమీక్షిస్తారని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీస్ స్టేషన్ పార్ట్ టైమ్ పాఠశాల అనే కాన్సెప్ట్ తో 14 దేశాల్లో సూత్రవాక్యం సిద్ధం

తెలంగాణ నేపథ్యంగా సాగే రాజు గాని సవాల్ టీజర్ ఆవిష్కరించిన జగపతిబాబు

Vijay Deverakonda: నా వయసు 35 సంవత్సరాలు, నేను ఒంటరిగా లేను.. విజయ్ దేవరకొండ

Siddu: బ్యాడాస్ లో చుట్టూ కెమెరాలు మధ్యలో సిగార్ తో సిద్ధు జొన్నలగడ్డ లుక్

Samantha: రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించిన సమంత.. ఫోటోలు షేర్ చేసింది.. కన్ఫామ్ చేసిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments