Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమే... మోడీ నోటీసులు వచ్చాయి : ఎమ్మెల్సీ కవిత

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (19:19 IST)
తనకు ఈడీ నోటీసులు వచ్చాయని వాటిని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కె.కవిత అన్నారు. ఈ నోటీసులను తాను ఈడీ నోటీసులుగా పరిగణించడం లేదని, మోడీ నోటీసులుగా భావిస్తున్నట్టు చెప్పారు. రాజకీయ కక్షతో వచ్చినా నోటీసులు కాబట్టి అంతగా స్పందించాల్సిన లేదని తెలిపారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను టీవీ సీరియల్‌గా లాగుతున్నారని కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఈడీ పంపిన నోటీసులు నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, తనకు నోటీసులు వచ్చాయని, న్యాయ సలహా తీసుకుంటున్నామని తెలిపారు. రాజకీయ దురుద్దేశ్యంతో తనకు నోటీసులు వచ్చాయన్నారు. ఇవి రాజకీయ కక్షతో వచ్చిన నోటీసులు కాబట్టి అంతగా స్పందించాల్సిన అవసరం లేదని పెద్దగా ఆలోచించాల్సిన అవసరమూ లేదన్నారు. ఇపుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్లీ కొత్త ఎపిసోడ్‌ వచ్చిందన్నారు. 
 
సంవత్సరకాలంగా దీనిని టీవీ సీరియల్‌లా లాగుతున్నారని, కాబట్టి సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇవి ఈడీ నోటీసులు కాదని, మోదీ నోటీసులు అన్నారు. ఈడీ నోటీసులు నేపథ్యంలో తాను రేపు విచారణకు హాజరుకావడం లేదన్నారు. సుప్రీంకోర్టులో విచారణ తర్వాతే హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ ఎపిసోడ్ ఇంకెంత కాలం కొనసాగుతుందో ఉండాలన్నారు. గతంలో 2జీ విచారణ చాలా కాలం సాగిస్తుందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు కూడా దీనిని సీరియస్‌గా తీసుకోరన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments