Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత.. 4 కిలోమీటర్ల పాదయాత్రకు తర్వాత..?

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (16:37 IST)
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత గురయ్యారు. ఏటూరునాగారం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన అనంతరం అస్వస్థత గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం సీతక్కను ఏటూరునాగారం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 
దళిత గిరిజన దండోర యాత్ర సందర్భంగా స్థానిక మార్కెట్‌ నుంచి తహసీల్‌ కార్యాలయం వరకు 4 కిలోమీటర్ల మేర సీతక్క పాదయాత్ర చేశారు. అనంతరం తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించిన తర్వాత కార్యాలయం బయట కూర్చున్న సీతక్క ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. శరీరమంతా చెమటలు పట్టాయి. అక్కడే ఉన్న కార్యకర్తలు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 
ప్రస్తుతం సీతక్క అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీతక్క అస్వస్థతకు గురవడంతో కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. సమయానికి ఆస్పత్రిలో సూపరింటెండెంట్ లేకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments