భూత వైద్యం పేరుతో బాలికకు మత్తు మందిచ్చి 3 నెలల పాటు..?

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (19:45 IST)
భూత వైద్యం పేరుతో ఓ దొంగబాబా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుండటంతో మహిళలు ఆ బాబాకు దేహశుద్ది చేశారు. వైద్యం పేరుతో 15 ఏళ్ల బాలికను లొంగదీసుకుని ఆమెకు మత్తుమందు ఇచ్చి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో ఆ దొంగబాబకు బడితపూజ చేశారు. ఈ ఘటన మంగళవారం నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. 
 
అయితే కుటుంబ సమస్యల కారణంగా నిజామాబాద్‌కు చెందిన ప్రసాద్‌ అనే భూత వైద్యున్ని సదరు బాలిక సంప్రదించింది. సమస్య పరిష్కరిస్తానని అమాయకురాలైన బాలికను బెదిరించి లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా బాలికకు మత్తుమందు ఇచ్చి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తెలిపింది.
 
ఈ క్రమంలో బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు స్థానిక మహిళలతో కలిసి బాబాను తీవ్రంగా చితకబాదారు. ఇంకా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దొంగబాబాను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం