Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి ప్రశాంత్​రెడ్డి.. ఎందుకబ్బా!?

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (08:34 IST)
ముఖమంత్రి కేసీఆర్ రెండేళ్ల కాలంలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారని మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలిపారు. శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు వరద కాలువ వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం రైతులతో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ... మధ్యలో మంత్రి ప్రశాంత్​రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.

రెండేళ్ల వ్యవధిలోనే కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను శ్రీరాంసాగర్​కు తరలించామని మంత్రి ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. వరద నీటి మల్లింపు, వినియోగంలో... సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి పూజలు చేశారు.

సీఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రైతులకు సాగు నీటి విషయంలో ఎన్ని కోట్లు ఖర్చయినా... వెనుకాడే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ... భావోద్వేగానికి గురయ్యారు.

ఈ ప్రాజెక్టు కోసం సీఎం కేసీఆర్​తో​ ఎంత కష్టపడ్డారో తనకు తెలుసునని... వందల మంది ఇంజినీర్లు ఆహోరాత్రులు నిద్రలేకుండా శ్రమించారని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments