ఈటల రాజేందర్‌ను తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన మంత్రి కేటీఆర్, ఎందుకో?

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (22:15 IST)
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌తో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం వల్భాపూర్‌లో ఈటల హాట్ కామెంట్స్ చేశారు. ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అలాంటిది ఏమీ లేదని కరోనాపై చర్చించడానికే అని టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నారు.
 
అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఈటలను తన కారులో ఎక్కించుకుని మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం వల్భాపూర్‌లో ఆయన రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులం, డబ్బు, పార్టీ జెండా ఏదీ శాశ్వతం కాదని, మనిషిని గుర్తుంచుకోవాలని అన్నారు.
 
మహాభారతంలో కౌరవులు, దుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చిందని.. సమాజంలో కూడా అందరూ ఒకేలా ఉండరని పేర్కొన్నారు. మోసం చేసిన హృదయాలు మంచిగా ఉండవని, ఇబ్బంది పడతాయని చెప్పారు. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ.. అంతిమ విజయం వాటిదేనన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments