Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదినిమిషాల కార్యక్రమంలో మంత్రి కేటీఆర్

Webdunia
ఆదివారం, 24 మే 2020 (23:19 IST)
సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పురపాలక శాఖ చేపట్టిన 'ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమము'లో ఈరోజు మంత్రి కేటీ రామారావు తన ఇంటిలో భాగస్వాములయ్యారు.

ఇందులో భాగంగా ఇంటితోపాటు, ఇంటి పరిసరాల్లో పేరుకుపోయిన నీటి పరిశీలన తో పాటు, పూల కుండిలతో పాటు, వివిధ పాత్రల్లో నిండిన నీటిని శుభ్రపరచారు.

దీంతోపాటు ప్రగతిభవన్లో ని గార్డెన్ వంటి ఏరియాల్లో ఎక్కడైనా వాననీరు పేరుకుపోయినడెమనని పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిరంతరం  పది వారాల పాటు కొనసాగించాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు.

ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు ఇంటి శుభ్రత కోసం సమయం కేటాయిస్తే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టడానికి వీలవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీజనల్ వ్యాధుల ను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కలిసి రావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు.

పురపాలక శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క పౌరుడు వారానికి పది నిమిషాలపాటు ఆదివారం రోజు కేటాయించి పరిసరాల పరిశుభ్రత పైన ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments