Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరో వచ్చి.. తెలంగాణ రైతులకు అన్యాయం జరిగిందని అరుస్తున్నారు.. మంత్రి హరీష్

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (16:48 IST)
తెలంగాణా రాష్ట్రంలో కొత్త పార్టీని పెట్టనున్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు పేరు ప్రస్తావించకుండానే సుతిమెత్తగా విమర్శలు గుప్పించారు. 

సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో బుధవారం రైతు వేదికను ప్రారంభించిన హరీష్ రావు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ఆయన కామెంట్స్ చేశారు. 

'ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారు. ఇక్కడికొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారు' అంటూ పరోక్షంగా షర్మిలకు హరీష్ రావు చురకలంటించారు. అసలు వాళ్లకు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా? అని ప్రశ్నించారు. 

ఏపీలో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఎంత భూమి ఉన్నా రూ.12.500 మాత్రమే ఇస్తున్నారని, అదే ఇక్కడ ఎకరానికి పదివేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతుబంధు ఇస్తున్నామని హరీష్ గుర్తు చేశారు.

కాగా, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ షర్మిల మంగళవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లో తన మద్దతుదారులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రకటించిన విషయం తెల్సిందే. పైగా, తనకు, అన్న జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments