Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ను గెలిపిస్తాం : అసదుద్దీన్ ఓవైసీ

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (13:03 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెరాస అధినేత కేసీఆర్‌కు మద్దతిచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి మద్దతిచ్చి గెలిస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడాన్ని కేసీఆర్‌తో పాటు అసదుద్దీన్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
ఈనేపథ్యంలో తెరాస అధినేత కేసీఆర్‌తో సమావేశమైన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకు తన సొంత రాష్ట్రంలోనే తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో కనీసం రెండు ఎంపీ స్థానాలు కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. 
 
ఏపీలో తాను ప్రచారం చేస్తే ఎలా వుంటుందో? ఆ ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకు రుచి చూపిస్తాననీ, ఆంధ్రాకు వెళ్లి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసినా తెలంగాణలో చంద్రబాబు ఫలితాలు సాధించలేకపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments