Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ను గెలిపిస్తాం : అసదుద్దీన్ ఓవైసీ

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (13:03 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెరాస అధినేత కేసీఆర్‌కు మద్దతిచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి మద్దతిచ్చి గెలిస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడాన్ని కేసీఆర్‌తో పాటు అసదుద్దీన్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
ఈనేపథ్యంలో తెరాస అధినేత కేసీఆర్‌తో సమావేశమైన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకు తన సొంత రాష్ట్రంలోనే తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో కనీసం రెండు ఎంపీ స్థానాలు కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. 
 
ఏపీలో తాను ప్రచారం చేస్తే ఎలా వుంటుందో? ఆ ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకు రుచి చూపిస్తాననీ, ఆంధ్రాకు వెళ్లి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసినా తెలంగాణలో చంద్రబాబు ఫలితాలు సాధించలేకపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments