Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ కోసం హోరు వానలో మెట్రో రైలు నడిపారు, ఏం జరిగింది?

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (17:15 IST)
సమయం రాత్రి 9.30 గంటలు కావస్తోంది. ఓ ప్రక్క హోరున వాన కురుస్తోంది. అది హైదరాబాదులోని వీఆర్ కొత్తపేటలోని మెట్రో స్టేషన్. ఓ గర్భిణీ ఆ రాత్రి సమయంలో అక్కడికి వచ్చింది. తాను మియాపూర్ వెళ్లాలని, కానీ తను వెళ్లడానికి బస్సులు, ఆటోలు అందుబాటులో లేవని అక్కడి సిబ్బందికి తెలిపింది.
 
కోవిడ్ నిబంధనలతో మెట్రో రైళ్లు ఉదయం 7 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తిరుగుతున్నాయి. ఆమె అక్కడికి వచ్చే సమయానికి రాత్రి మెట్రో ట్రైన్ వెళ్లిపోయింది. అక్కడి సిబ్బంది కూడా అదే విషయాన్ని ఆమెకు తెలిపారు. దీంతో ఆమె సిబ్బందితో ఏలాగైనా తాను మియాపూర్ వెళ్లాలని దానికి సహాయం చెయ్యాలని ప్రాధేయపడింది. దీంతో అక్కడి సిబ్బంది తమ పైఅధికారులకు విషయాన్ని చేరవేశారు.
 
తమ ప్రయత్నంగా ఆమె పరిస్థితిని తెలిపారు. దీంతో స్పందించిన అధికారులు ఆమె ఒక్కరి కోసమే మెట్రో సర్వీసును సిద్దం చేశారు. ఆమెను మెట్రోలో ఎక్కించుకుని 40 నిమిషాల్లో మియాపూర్ చేర్చారు. ఆమె క్షేమంగా మియాపూర్ చేరడానికి సహకరించారు. ఆ విషయాన్ని మెట్రో భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎమ్‌డీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర సమయాల్లో పౌరులను కాపాడేందుకు మెట్రో నడపాలని నిబంధన ఉందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments