బైక్ యాక్సిడెంట్ కేసు : సాయిధరమ్ స్పందించడం లేదు.. త్వరలో చార్జిషీట్

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (07:44 IST)
బైక్ యాక్సిడెంట్ కేసులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధరమ్ తేజ్‌కు పంపిన నోటీసులపై స్పందించడం లేదని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని వారు తెలిపారు. 
 
దీనిపై సైబరాబాద్ పోలీసీ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, బైక్ ప్రమాదం కేసులో సాయి ధరమ్‌కు నోటీసులు పంపించగా, ఆయన ఇప్పటివరకు స్పందించలేదని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదైవుందని, అందువల్ల లైసెన్స్, బైక్ ఆర్సీ, ఇన్యూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ సాయి ధరమ్ మాత్రం స్పందించలేదని చెప్పారు. అయినప్పటికీ త్వరలోనే ఆయనపై చార్జిషీటు దాఖలు చేస్తామని తెలిపారు. 
 
ఇదిలావుంటే, గత యేడాది సైబరాబాద్ పరిధిలో జరిగిన నేరాలు, రహదారి ప్రమాదాలకు సంబంధించి ఆయన ఒక వార్షిక నివేదికను విడుదల చేశారు. ఇందులో ఈ యేడాది రోడ్డు ప్రమాదాల్లో 759 మంది మరణిస్తే, వీరిలో 80 శాతం మంది తలకు హెల్మెట్లు ధరించక పోవడంతో చనిపోయారని వివరించారు. 
 
అలాగే, 712 రోడ్డు ప్రమాద కేసుల్లో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల 212 ప్రమాదాలు జరిగినట్టు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుపడిన వాహనచోదకుల నుంచి రూ.4.50 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు చెప్పారు. అలాగే, 9981 వాహనచోదకుల లైసెన్సులు రద్దు చేసినట్టు ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments