Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింత చెట్టు కింద కుళ్లిన శవం ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (15:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. కుటుంబ సమస్యల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని శవం చింత చెట్టు కింద కుళ్లిపోయిన స్థితిలో కనిపించడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ మున్సిపల్ అతివేల్లి గ్రామానికి చెందిన గడ్డం ప్రకాష్ ఈ నెల 1వ తేదీ నుంచి కనిపించలేదు. ఇదే విషయంపై ఆయన భార్య ఈనెల 6వ తేదీన మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదేసమయంలో కుటుంబ సభ్యులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా, ఆయన శవం చింత చెట్టు కింద కనపడింది. 
 
కాగా శుక్రవారం అతివేల్లి లోని ఓ సిమెంట్ పైపులు తయారీ కంపెనీ సమీపంలోని చింతచెట్టు కింద పడిపోయింది. అక్కడి వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు అని స్థానికులు తెలిపారు. పోలీసులు సదరు మృతదేహం తప్పిపోయిన గడ్డం ప్రకాష్‌గా గుర్తించారు. 
 
వ్యక్తిగత సమస్యల కారణంగా ఆయనే చెట్టుకు ఊరివేసుకొని ఉంటాడని... మృతిదేహం 10 రోజులపైగా కుళ్లి పోయి చెట్టు కింద పడిపోయిందని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments