మెదక్ జిల్లాల్లో విషాదం : సీఎంకు లేఖ రాసి రైతు ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (14:30 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాల్లో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకునేముందు ముఖ్యమంత్రికి లేఖ రాసిమరీ చనిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మెదక్ జిల్లాలోని హవేలి ఘన‌పూర్ మండలంలోని బొగడ భూపతిపూర్ గ్రామంలో ఓ యువరైతు ఉన్నాడు. ఈయన కుమారుడు అనారోగ్యంబారినపడ్డాడు. అతనికి వైద్యం చేయించేందుకు డబ్బులు లేవు. 
 
పైగా, ఆసరా పెన్షన్‌కు అర్హుడైన తన తండ్రికి పెన్షన్ రావడం లేదు. దీనికితోడు పండించిన వరి ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకునిపోయాడు. 
 
ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే ఆత్మహత్యే శరణ్యమని భావించిన ఆ రైతు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసి తన జేబులో పెట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Wala 2: మంచి సినిమాకి ఎలాంటి సరిహద్దులు ఉండవు : సాయి దుర్గతేజ్, నిఖిల్

Tamil movies hava::వేసవిలో తెలుగు భారీ చిత్రాలు లేకపోవడంతో తమిళ చిత్రాలదే హవా

Suri: మండాడి షూటింగ్ పూర్తి - శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు

King of Pop Review: కింగ్ ఆఫ్ పాప్ నెటిజన్ల రివ్యూ - మైఖేల్ జాక్సన్ బయోపిక్ ను అల్లు అర్జున్ చేస్తాడా?

కన్న మూవీ పరిశ్రమలో నిలిచిపోతుంది : హీరో కార్తిక్ శివన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments