వికారాబాద్‌లో మహిళ కిడ్నాప్... మాజీ భర్తపై అనుమానం?

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (09:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌లో మహిళ కిడ్నాప్‌కు గురైంది. మరో మహిళతో కలిసి రోడ్డుపై నడిచి వెళుతుండగా కొందరు దుండగులు వచ్చిన ఈ మహిళను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. 
 
ఈ కిడ్నాప్‌పై స్థానిక పోలీసులకు సమాచారం అదించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ప్రత్యేక టీమ్‌లు కిడ్నాపైన మహిళ కోసం వెతుకులాట ప్రారంభించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, దీపిక అనే మహిళ మరో మహిళతో కలిసి రోడ్డుపై నడుస్తూ వెళుతుండగా, గుర్తు తెలియని దుండగులు కొందరు దీపికను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ యువతి గత నాలుగేళ్ళ క్రితం అఖిల్ అనే యువకుడిని ప్రేమ పెళ్ళి చేసుకుంది. ఆ తర్వాత అతనికి దూరమైంది. సో.. అతనే కిడ్నాప్ చేసివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
కాగా, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అందుబాటులో ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ నీ పరిశీలిస్తున్నారు. దుండగులు అనంతగిరి వైపు వెళ్లి ఉంటారని భావించి, ఆ వైపు రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం