Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలుగులో మావోయిస్టుల పోస్టర్లు కలకలం... ఇన్ఫార్మర్లకు వార్నింగ్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (13:25 IST)
తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో ఆంధ్రా, ఒరిసా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరగడంతో పోలీసుల గస్తీ కూడా పెంచారు. అలాగే భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశాయి.
 
ఈ నేపథ్యంలో మలుగు జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. గురువారం వెంకటాపురం మండలి, కొండాపూర్ - ఆలుబాక గ్రామాల మధ్య మావోల పోస్టర్లు వెలిశాయి. ఇవి వెంకటాపురం - వాజేడు ఏరియా కమిటీ పేరుతో ముద్రించారు. అలాగే, కొన్ని లేఖలను కూడా స్థానికులు గుర్తించారు. ముఖ్యంగా, పోలీసులకు తమ గురించి సమాచారం అందించే వారిని హెచ్చరిస్తూ ఈ పోస్టర్లను ముద్రించి అంటించారు. 
 
బొల్లారం, సీతారాంపురం, కలిపాక గ్రామాలకు చెందిన కొంతమంది పేర్లను అందులో పేర్కొంటూ, వీరంతా పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వారు హెచ్చరించారు. ఈ పోస్టర్లు ఇపుడు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments