Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలుగులో మావోయిస్టుల పోస్టర్లు కలకలం... ఇన్ఫార్మర్లకు వార్నింగ్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (13:25 IST)
తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో ఆంధ్రా, ఒరిసా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరగడంతో పోలీసుల గస్తీ కూడా పెంచారు. అలాగే భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశాయి.
 
ఈ నేపథ్యంలో మలుగు జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. గురువారం వెంకటాపురం మండలి, కొండాపూర్ - ఆలుబాక గ్రామాల మధ్య మావోల పోస్టర్లు వెలిశాయి. ఇవి వెంకటాపురం - వాజేడు ఏరియా కమిటీ పేరుతో ముద్రించారు. అలాగే, కొన్ని లేఖలను కూడా స్థానికులు గుర్తించారు. ముఖ్యంగా, పోలీసులకు తమ గురించి సమాచారం అందించే వారిని హెచ్చరిస్తూ ఈ పోస్టర్లను ముద్రించి అంటించారు. 
 
బొల్లారం, సీతారాంపురం, కలిపాక గ్రామాలకు చెందిన కొంతమంది పేర్లను అందులో పేర్కొంటూ, వీరంతా పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వారు హెచ్చరించారు. ఈ పోస్టర్లు ఇపుడు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments