Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ ఇంజనీరింగ్ పనులు.. ఇక్కడ పలు రైళ్లు రద్దు

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (11:04 IST)
ఖరగ్‌పూర్ డివిజన్‌లో రైల్వే ట్రాక్, ఇంజనీరింగ్ పనులు మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో సికింద్రాబాద్ కేంద్రంగా పని చేసే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. ఇటీవల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం తర్వాత రైల్వే శాఖ నిద్రమత్తును వీడింది. దీంతో పలు ప్రాంతాల్లో భద్రతా పరమైన పనులు, తనిఖీలను ముమ్మరం చేసింది. ఈ పనులకు ఆటంకంగా ఉండరాదని భావించిన రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసుంది. ఖరగ్‌పూర్‌ డివిజన్‌లో భద్రతాపరమైన పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి మంగళవారం తెలిపారు. 
 
బుధవారం నాడు పుదుచ్చేరి - హౌరా (12868), షాలిమార్‌ - హైదరాబాద్‌ (18045), హైదరాబాద్‌ - షాలిమార్‌ (18046) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ - షాలిమార్‌ (22854), షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (12773), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - షాలిమార్‌ (22826), హౌరా - సత్యసాయి ప్రశాంతి నిలయం (22831), తాంబరం - సంత్రాగచ్చి (22842), షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (22849), గురువారం నాడు ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - సంత్రాగచ్చి (22808), ఎస్‌ఎంవీ బెంగళూరు - హౌరా (22888) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments