Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం... కిరాతకుడిగా మారిపోయిన భర్త

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (13:28 IST)
భార్యపై అనుమానంతో భర్త కిరాతకుడిగా మారిపోయాడు. ఇద్దరు పిల్లల కళ్లముందే.. భార్యను గొంతుకోసి కిరాతకంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధి, పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీకి చెందిన కంది చంద్రయ్య కూతురు దివ్యభారతి(33)కి హైదరాబాద్ అంబర్‌పేట ప్రాంతానికి చెందిన పుస్తకాల దీపక్‌ (40)తో 12 ఏళ్ల క్రితం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. బాబు ఐదు, పాప మూడో తరగతి చదువుతున్నారు. 
 
వివాహ సమయంలో కట్నకానుకలు భారీగానే ఇచ్చినా దీపక్ అదనపు కట్నం, అనుమానంతో ఆమెను వేధిస్తూ ఉండేవాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న దివ్యభారతిపై దాడికి పాల్పడ్డాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో పిల్లలు నిద్రలేచారు. వారు చూస్తుండగానే దీపక్ కత్తితో భార్య గొంతుకోసి చంపేశాడు.
 
అర్ధరాత్రి ఆ ఇంట్లో నుంచి కేకలు, పిల్లల ఏడుపులు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments