Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మరో నవీన్ హత్య కేసు రిపీట్.. ప్రేయసితో క్లోజ్‌గా వున్నాడని.?

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (13:09 IST)
తెలంగాణలో మరో నవీన్ హత్య కేసు రిపీట్ అయ్యింది. ప్రేమకు అడ్డుగా వున్న స్నేహితుడిని హతమార్చిన ఘటన మరవకముందే.. ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రేయసితో చనువుగా వుండటాన్ని సహించలేక స్నేహితుడిని మద్యం సేవించి బీర్ బాటిల్‌తో పొడిచి చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. 
 
20 ఏళ్ల రాజ్ కపిల్ సాహు బీహార్ నుంచి రెండేళ్ల క్రితం తెలంగాణలో సెటిల్ అయ్యారు. 21 ఏళ్ల రాహుల్ కూడా బీహార్ నుంచే వచ్చి తెలంగాణలో వలస వచ్చాడు. ఈ ఇద్దరు స్నేహితులు ఒకే యువతిని ప్రేమించారు. అయితే ఆ యువతి కపిల్‌తో ప్రేమలో పడింది. దీన్ని రాహుల్ సింగ్ తట్టుకోలేకపోయాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం కపిల్‌ను రప్పించి ఇద్దరూ మద్యం సేవించారు. ఆ సమయంలో రాహుల్ స్నేహితులు కూడా వున్నారు.
 
అనంతరం బీరు సీసాలు పగలగొట్టి వాటితో పొడిచారు. రాయితో తలపై కొట్టాడు. దీంతో రాజ్ కపిల్ సాహు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం బయటికి వచ్చింది. రాహుల్ వద్ద జరిపిన విచారణలో తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. అతనితో పాటు ఈ హత్యకు పాల్పడిన ఇతర నిందితులను కూడా అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments