Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మరో నవీన్ హత్య కేసు రిపీట్.. ప్రేయసితో క్లోజ్‌గా వున్నాడని.?

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (13:09 IST)
తెలంగాణలో మరో నవీన్ హత్య కేసు రిపీట్ అయ్యింది. ప్రేమకు అడ్డుగా వున్న స్నేహితుడిని హతమార్చిన ఘటన మరవకముందే.. ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రేయసితో చనువుగా వుండటాన్ని సహించలేక స్నేహితుడిని మద్యం సేవించి బీర్ బాటిల్‌తో పొడిచి చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. 
 
20 ఏళ్ల రాజ్ కపిల్ సాహు బీహార్ నుంచి రెండేళ్ల క్రితం తెలంగాణలో సెటిల్ అయ్యారు. 21 ఏళ్ల రాహుల్ కూడా బీహార్ నుంచే వచ్చి తెలంగాణలో వలస వచ్చాడు. ఈ ఇద్దరు స్నేహితులు ఒకే యువతిని ప్రేమించారు. అయితే ఆ యువతి కపిల్‌తో ప్రేమలో పడింది. దీన్ని రాహుల్ సింగ్ తట్టుకోలేకపోయాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం కపిల్‌ను రప్పించి ఇద్దరూ మద్యం సేవించారు. ఆ సమయంలో రాహుల్ స్నేహితులు కూడా వున్నారు.
 
అనంతరం బీరు సీసాలు పగలగొట్టి వాటితో పొడిచారు. రాయితో తలపై కొట్టాడు. దీంతో రాజ్ కపిల్ సాహు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం బయటికి వచ్చింది. రాహుల్ వద్ద జరిపిన విచారణలో తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. అతనితో పాటు ఈ హత్యకు పాల్పడిన ఇతర నిందితులను కూడా అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments