Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మణిపూర్ ఘటన- నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు

Advertiesment
manipur roits
మణిపూర్ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోంది. మే 4వ తేదీన ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు మణిపూర్ పోలీసులు తెలిపారు. మిగతా వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నామన్నారు. 
 
మరోవైపు ఈ కేసులో ఓ నిందితుడి ఇంటికి స్థానికులు నిప్పు పెట్టేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు చోటు లేదని మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రెయిన్‌డెడ్ -22 ఏళ్ల యువకుడి అవయవదానం.. నలుగురికి ప్రాణం పోసింది..