కౌలు డబ్బు ఇవ్వలేదని తల్లిపై పెట్రోల్ పోసి అంటించాడు

Webdunia
బుధవారం, 13 మే 2020 (21:31 IST)
తల్లి కౌలు డబ్బులు ఇవ్వలేదని మద్యం మత్తులో కొడుకు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ గ్రామంలోని వడ్డెర కాలనీలో నివసిస్తున్న లసుంబాయికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. చాలా కాలం క్రితం భర్త చనిపోవడంతో తనకున్న ఐదు ఎకరాల భూమిని కౌలుకిచ్చి ఆ డబ్బుతో జీవనం సాగిస్తోంది. 
 
ఆమె సంపాదించిన డబ్బుపై పెద్ద కొడుకు నాందేవ్ కన్ను పడింది. ఆ డబ్బు కోసం తల్లితో ఎన్నోసార్లు గొడవపడ్డాడు. ఇటీవల కౌలు డబ్బు రావడంతో ఒంటరిగా ఉన్న తల్లి దగ్గరకు వెళ్లి డబ్బు ఇవ్వమని గొడవ చేసాడు. ఆమె ససేమిరా అనడంతో మద్యం మత్తులో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమెకు శరీరం కాలి అరవడంతో కోడలు, కూతురు, స్థానికులు వచ్చి మంటలు ఆర్పారు. 
 
తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కొడుకు నాందేవ్, పెట్రోల్ అందించిన అతని భార్య దీపికపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments