Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌలు డబ్బు ఇవ్వలేదని తల్లిపై పెట్రోల్ పోసి అంటించాడు

Webdunia
బుధవారం, 13 మే 2020 (21:31 IST)
తల్లి కౌలు డబ్బులు ఇవ్వలేదని మద్యం మత్తులో కొడుకు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ గ్రామంలోని వడ్డెర కాలనీలో నివసిస్తున్న లసుంబాయికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. చాలా కాలం క్రితం భర్త చనిపోవడంతో తనకున్న ఐదు ఎకరాల భూమిని కౌలుకిచ్చి ఆ డబ్బుతో జీవనం సాగిస్తోంది. 
 
ఆమె సంపాదించిన డబ్బుపై పెద్ద కొడుకు నాందేవ్ కన్ను పడింది. ఆ డబ్బు కోసం తల్లితో ఎన్నోసార్లు గొడవపడ్డాడు. ఇటీవల కౌలు డబ్బు రావడంతో ఒంటరిగా ఉన్న తల్లి దగ్గరకు వెళ్లి డబ్బు ఇవ్వమని గొడవ చేసాడు. ఆమె ససేమిరా అనడంతో మద్యం మత్తులో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమెకు శరీరం కాలి అరవడంతో కోడలు, కూతురు, స్థానికులు వచ్చి మంటలు ఆర్పారు. 
 
తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కొడుకు నాందేవ్, పెట్రోల్ అందించిన అతని భార్య దీపికపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments