Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ జిల్లాలో ఒకే కొమ్మకు ఉరేసుకున్న ప్రేమజంట

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (17:12 IST)
నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట చెట్టు ఒకే కొమ్మకు ఉరేసుకున్నారు. ఎంతోకాలంగా ప్రేమించుకుంటూ వచ్చిన ఈ జంట.. ఏం కష్టమొచ్చిందో ఏమోగానీ... ప్రేమికులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఓ యువతీ యువకుడి మృతదేహాలు వేలాడుతుండటాన్ని స్థానికులు గుర్తించారు. వారిద్దరూ ఒకే కొమ్మకు ఉరేసుకుని వుండటం చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. 
 
వెంటనే పోలీసులు స్థానికులతో కలిసివచ్చి చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను కిందికి దించారు. ఆ తర్వా పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఈ ప్రేమ జంట వివరాలు తెలిశాయి. 
 
ఈ మృతులను మోస్రా మండలం తిమ్మాపూర్‌కు చెందిన మోహన్, లక్ష్మిలుగా గుర్తించారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడివుంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, వీరిద్దరూ వారం రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments