తెలిసీ తెలియని ప్రేమ.. ప్రాణాల మీదకు తెచ్చింది...

హాయిగా చదువుకోవాల్సిన వయసులో ఆకర్షణకు లోనై.. ముక్కుపచ్చలారని వయసులో క్షణికావేశానికి లోనై ఇరువురు ప్రేమికులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. హైదరాబాద్ రెహ్మత్ నగర్‌కు చెందిన శరత్ ‌(19) బంజారహిల్స్‌కు చెందిన యువతి(18) ఎస్.ఆర్ నగర్‌లో వేర్వేరు కళాశాలల్లో

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (15:49 IST)
హాయిగా చదువుకోవాల్సిన వయసులో ఆకర్షణకు లోనై.. ముక్కుపచ్చలారని వయసులో క్షణికావేశానికి లోనై ఇరువురు ప్రేమికులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. హైదరాబాద్ రెహ్మత్ నగర్‌కు చెందిన శరత్ ‌(19) బంజారహిల్స్‌కు చెందిన యువతి(18) ఎస్.ఆర్ నగర్‌లో వేర్వేరు కళాశాలల్లో ఇంటర్ చదవుతున్నారు.
 
10 వతరగతి నుంచే మొదలైన వీరి స్నేహం ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో ఇరువురిని మందలించారు. దీంతో గోల్కొండ కోటకు చేరుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ యువ ప్రేమికులు. ఆత్మహత్య విషయం శరత్ స్నేహితుడు మనీష్‌కు ఫోన్లో తెలియజేయడంతో మనీష్ గోల్కొండ కోటకు చేరుకుని ఇరువురినీ వారించాడు.
 
అయినా వినకుండా ప్రేమికులిద్దరూ పరుగెత్తుకుంటూ వెళ్లి దూకేశారు. స్థానికులు గమనించి గోల్కొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు  అక్కడికి వెళ్లేసరికి ఇద్దరూ అపస్మారక స్థితిలో కనిపించారు. తక్కువ ఎత్తులో నుంచి కిందకు దూకడం మూలంగా ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SriRam: ది మేజ్‌ నుంచి శ్రీరామ్‌ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌

కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!

సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్‌ యరబోలు

NTR: ఎన్‌టీఆర్ కు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

తర్వాతి కథనం
Show comments