అన్నతోనే ప్రేమాయణం, వద్దని వారించినా వినని యువతి చివరికి...

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (10:19 IST)
వరుసకు అన్న. తోడల్లుడి కుమారుడు. అయితే  ఆ యువతి అతడిని ప్రేమించింది. ఆ విషయాన్ని అతనికే చెప్పింది. తొలుత అతడు కాదన్నాడు. ఒత్తిడి చేయడంతో ఆ అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. ఇద్దరూ అన్ని విధాలుగా దగ్గరయ్యారు. చివరకు ఇంట్లో తెలిసి మందలించారు. కానీ తను ఇష్టపడినివాడు దూరమవుతున్నాడన్న బాధతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని నార్నూల్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ కుమార్తె  వైష్ణవికి 15 యేళ్ళు. ఈ మధ్యే 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటి దగ్గరే ఉంటోంది. శ్రీనివాస్ భార్య ఆదిలాబాద్ నగరంలో అంగన్‌వాడీలో విధులను నిర్వర్తిస్తోంది.
 
దీంతో ఆమె అక్కడే ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన అన్న మహేష్ తరచూ ఇంటికి వచ్చేవాడు. ఏవేవో కథలు చెప్పేవాడు. అన్న కావడంతో తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అతనికి బాగా దగ్గరైపోయింది వైష్ణవి.
 
అన్నను ప్రియుడుగా మార్చేసుకుంది. మొదట్లో ఇది తప్పని చెప్పాడు మహేష్. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో ఇతనే మారిపోయి ప్రేమికుడయ్యాడు. విషయం కాస్తా ఇంట్లో తెలిసిపోయింది. వైష్ణవిని మందలించారు. ఆదిలాబాద్ నగరంలోని తల్లి ఇంటికి పంపారు. దీంతో ఆ యువతి మనస్థాపానికి గురైంది. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వైష్ణవి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments