అత్తవారింటికి తీసుకెళ్లలేదని ఆత్మహత్య చేసుకుంది

Webdunia
గురువారం, 21 మే 2020 (22:01 IST)
కొత్తగా పెళ్లయిన యువతిని అత్తారింటికి తీసుకువెళ్లలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన మూడు రోజులకే లాక్‌డౌన్‌ ప్రారంభమవడంతో ఆమె అత్తవారింటికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. హైదరాబాద్ ఉప్పుగూడ దానయ్యనగర్‌కు చెందిన మోహన్‌ కుమార్తె వనజకు వరంగల్‌కు చెందిన అనిల్‌‌కు మార్చి 19న వివాహం జరిగింది. 
 
లాక్‌డౌన్ కారణంగా రవాణా వసతి లేక ఆమెను అత్తారింటికి తీసుకువెళ్లలేదు. తనను కాపురానికి తీసుకువెళ్లమని భర్తను తరచూ కోరుతుండటంతో, లాక్‌డౌన్ ముగిశాక సంప్రదాయబద్ధంగా తీసుకెళ్తామని అత్తమామలు చెప్పారు. అనిల్ రెండుమూడు సార్లు బైక్‌పై అత్తారింటికి వచ్చి భార్యను చూసి వెళ్లాడు. అయినా కూడా భర్తకు దూరంగా ఉండటం ఆమెను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది.
 
మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు అది గమనించి వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. పెళ్లయిన రెండు నెలలకే విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా జీవితంలో ఆ కథ ముగిసిపోయింది : మంచు లక్ష్మి

నటి ప్రత్యూషను 10 మందితో గ్యాంగ్ రేప్ చేయించి చంపేసాడు, కుక్కచావు చస్తాడు: తల్లి ఆవేదన

Anupama Parameswaran: క్రేజీ కల్యాణం నుంచి అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే పోస్టర్

Suhas: నా ముందే ఒకాయన సెట్‌లో ఇతన్నెందుకు పిలిచారు అన్నాడు: సుహాస్‌

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments