Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేట్ నైట్.. సోషల్ మీడియా వుండగా.. ఇక నిద్రెందుకు దండగ!? (video)eo)

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (11:21 IST)
హైదరాబాదీయులు ఎక్కువ సేపు నిద్ర పోవట్లేదని తాజా అధ్యయనంలో తేలింది. కొందరు ఉద్యోగాల కోసం రాత్రి పూట లేటుగా నిద్రపోతుంటే.. కొందరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నిద్రను త్యాగం చేస్తున్నారు. ఇంకొందరు సోషల్ మీడియా ఉంటుండగా నిద్రపోవడం లేదని చెబుతున్నారు. అర్థరాత్రి పూట సోషల్ మీడియా గడిపే వారు హైదరాబాదులో అధికమవుతున్నారని వేక్‌ఫిట్ గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్కార్డ్ 2022 సర్వేలో తేలింది.  
 
జనాల్లో నిద్ర అలవాట్లపై  ‘వేక్ ఫిట్’ సంస్థ దేశవ్యాప్తంగా ఈ ఏడాది మెట్రో నగరాల్లో ‘గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డ్ 2022 ’సర్వే రిపోర్ట్ ని ఇటీవల రిలీజ్​ చేసింది. ఇందులో ఫోను వాడుతూ రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతున్న వాళ్ల సంఖ్య దేశవ్యాప్తంగా 57శాతం పెరిగిందని పేర్కొంది. 
 
ముఖ్యంగా హైదరాబాదీల్లో గతేడాదితో పోలిస్తే పడుకునే ముందు ఫోన్ వాడే వారి సంఖ్య తగ్గినప్పటికి, నిద్రలేమితో బాధపడుతున్నవారి సంఖ్య 32 శాతం పెరిగినట్లు తెలిపింది. ప్రతి పదిమంది హైదరాబాదీల్లో నలుగురు రాత్రిళ్లు సోషల్ మీడియా వాడుతూ.. నిద్రకు దూరమవుతున్నారని సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో  దాదాపు 14 ప్రశ్నలు అడిగారు.   
 
రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుంటే వివిధ రకాల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది.  లేట్ నైట్ ఫోన్లు వాడకం, సోషల్ మీడియా ఎక్కువ వాడటం  వల్ల కంటి సంబంధిత సమస్యల్లో చిక్కుకుంటారు.  దీంతో పాటు  నిద్రలేమి (ఇన్​సోమ్నియా), హార్ట్ బీట్‌లో ఇబ్బందులు, హార్మోనల్ ఇంబాలెన్స్,  బరువుపెరగడం,  ఉదయం నిద్రపోయే అలవాటు పెరగడం, భవిష్యత్‌లో కార్డియో సంబంధిత సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి  సమస్యలు వస్తాయి. 
 
మహిళల్లో సంతాన లేమి సమస్యలు, పీరియడ్ సైకిల్ సక్రమంగా రాకపోవడం వంటివి కూడా వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరికీ సరైన నిద్ర అవసరం’ అని డాక్టర్లు అంటున్నారు. మగవారితో పోలిస్తే ఆడవారిలోనే అధికంగా నిద్రలేమి భయాలు ఉన్నట్లు తేలింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments