Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేట్.. మీ ధైర్యానికి సెల్యూట్ : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి కేటీఆర్

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (17:47 IST)
ఇటీవల తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి ధైర్యాన్ని ఆయన మెచ్చుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన తర్వాత వారితో ప్రసంగించారు. తాను కూడా హాస్టల్స్‌లో చదివానని, హాస్టల్స్‌లో ఉండే సమస్యలు తనకు కూడా బాగా తెలుసని ఈ సందర్భంగా అన్నారు. 
 
ముఖ్యంగా తమ సమస్య పరిష్కారం కోసం బాసర విద్యార్థులు అనుసరించిన విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. రాజకీయాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా తమ సమస్యలపై తామే పోరాడిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు చెప్పారు. 
 
పనిలేని విపక్ష రాజకీయ నేతలను పిలవకుండా స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్‌గా ఏర్పడి మీ సమస్యలపై మీరే పోరాడడం బాగుందన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఎంచుకున్న విధానం కూడా తనకు బాగా నచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. 
 
ముఖ్యంగా గాంధీ తరహాలో శాంతియుతంగా వర్షం పడుతున్నా లెక్క చేయకుండా బయటకూర్చొని నిరసన తెలియజేయడం చాలా మందికి నచ్చిందన్నారు. అందులో తాను కూడా ఒకడినని చెప్పారు. 
 
తాను ఈ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఈ మాట చెబుతున్నానని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసమే ఈ సమ్మె చేస్తున్నామని విద్యార్థులు ప్రభుత్వానికి స్పష్టం చేశారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments