టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు నేడు పట్టాభిషేకం

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (09:25 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందిన మాజీ మంత్రి కేటీఆర్‌కు సోమవారం పట్టాభిషేకం జరుగనుంది. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి తెరాస శ్రేణులు పెద్దఎత్తున హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నాయి. ఈ పట్టాభిషేక కార్యక్రమం పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో జరుగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక బసవతారకం ఆస్పత్రి నుంచి కేటీఆర్ ర్యాలీగా బయలుదేరి తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. 
 
అనంతరం 11.56 గంటలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తల నుద్దేశించి కేటీఆర్ మాట్లాడుతారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments