Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు నేడు పట్టాభిషేకం

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (09:25 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందిన మాజీ మంత్రి కేటీఆర్‌కు సోమవారం పట్టాభిషేకం జరుగనుంది. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి తెరాస శ్రేణులు పెద్దఎత్తున హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నాయి. ఈ పట్టాభిషేక కార్యక్రమం పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో జరుగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక బసవతారకం ఆస్పత్రి నుంచి కేటీఆర్ ర్యాలీగా బయలుదేరి తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. 
 
అనంతరం 11.56 గంటలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తల నుద్దేశించి కేటీఆర్ మాట్లాడుతారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments