Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పెట్టుబడులకు అనుకూలం: మంత్రి కేటీఆర్‌

Webdunia
గురువారం, 5 మే 2016 (09:41 IST)
మౌలిక వసతులు, పారదర్శక పాలనతో వ్యాపారానికి అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మలేషియా ప్రతినిధి బృందాన్ని కోరారు. మలేషియా, వ్యాపార, పరిశ్రమల శాఖమంత్రి ముస్తఫా మహమ్మద్‌ నేతృత్వంలోని పారిశ్రామికవేత్తల ప్రతినిధి బృందం బుధవారం కేటీఆర్‌తో సమావేశమైంది. 
 
ఇందులో మలేషియా, తెలంగాణ మధ్య వ్యాపార సంబంధాలు, పెట్టుబడులపై వారు చర్చించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం, వ్యాపార అవకాశాలను కేటీఆర్‌ వారికి వివరించారు. హైదరాబాద్‌ నగరంలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ కోరారు. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పారిశ్రామిక విధానంతో ముందుకు వెళుతోందని, ముఖ్యంగా.. పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూనే.. పరిశ్రమలకు అనుమతులు తక్షణం మంజూరు చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments