Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళేశ్వరం బ్రిడ్జి విరిగిపోయిందా.. వాళ్లు ఎక్స్‌పర్ట్ ఇంజనీర్లా?: కేటీఆర్

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (14:01 IST)
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.  కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వెళ్లి బ్రిడ్జి విరిగిపోతుందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాళ్లు ఎక్స్‌పర్ట్ ఇంజనీర్లలా మాట్లాడతారు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 
 
ఈ ఇద్దరు నాయకులు వంతెన విస్తరణ జాయింట్‌లను చూపుతున్నారని, వంతెన కూలిపోతుందని చెప్పడం ద్వారా ప్రజల్లో భయాన్ని పెంచుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని రేవంత్ రెడ్డితో కలిసి సందర్శించిన అనంతరం బీఆర్‌ఎస్ అధినేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.
 
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతల ఆరోపణపై.. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు వెచ్చించినప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు వరం అని, కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజలకు శాపమని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

తర్వాతి కథనం
Show comments