కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన.. షెడ్యూల్ వివరాలు ఇవే

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (14:08 IST)
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 16న కేటీఆర్ పర్యటన వుంటుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధ్రువీకరించారు. 
 
ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో పలు అభవృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, పువ్వాడ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 
 
షెడ్యూల్ వివరాలు
16న ఉదయం 9.00 హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి 10.00గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 
10.15 గంటలకు రఘునాథపాలెం పల్లె బృహత్ ప్రకృతి వనం పార్క్ ప్రారంభిస్తారు. 
10.45 గంటలకు ఖమ్మం టేకులపల్లి కేసీఆర్ టవర్స్ వద్ద డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిస్తారు.
 
అలాగే,  ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన ఫుట్ పాత్‌ను ప్రారంభిస్తారు. ఆపై మున్సిపల్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం బహిరంగ సభకు అనంతరం హైదరాబాదుకు తిరుగు ప్రయాణం అవుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments