Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ భార్యను భుజంపై 3 కిలోమీటర్లు మోశాడు.. కానీ అడవిలోనే ప్రసవం..

Webdunia
శనివారం, 18 జులై 2020 (13:23 IST)
మనదేశంలో కనీసం విద్యుత్, రోడ్డు సౌకర్యాలు లేని గ్రామాలు చాలానే వున్నాయి. అలాగే ఆదివాసీల పరిస్థితి మరింత దారుణంగా వుంది. ఆస్పత్రులు లేక గర్భిణీ మహిళలు ప్రాణాపాయ స్థితిలో కిలోమీటర్లు దూరం నడవాల్సిన పరిస్థితి ఇప్పటికీ వుంది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే భద్రాద్రిలో చోటుచేసుకుంది. 
 
తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రహదారి సౌకర్యం లేక.. అంబులెన్స్ వచ్చే పరిస్థితిలేక.. అడవిలోనే ఓ మహిళ ప్రసవించింది. చర్ల మండలంలోని కీకారణ్యమైన ఎర్రంపాడుకి చెందిన కొవ్వాసి ఐతే అనే నిండు గర్భిణీ... పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో.. కాలినడకలోనే ఎర్రంపాడు నుండి చెన్నారం వరకు మూడు కిలోమీటర్లు మోసుకెళ్లాడు ఆమె భర్త మాస, ఆయనకు ఆశా కార్యకర్త సోమమ్మ సహాయం చేసింది. ఇక, ఫోన్ సిగ్నల్ దొరకడంతో.. స్థానికుంగా ఉన్న యువకులు 108కి ఫోన్ చేశారు.
 
అయితే.. 108కి వచ్చేసరికే అడవిలోనే ప్రసవించి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఐతే.. ఇక, ఆ తర్వాత.. బాలింతను, శిశువును 108లో ప్రాథమిక చికిత్స తర్వాత.. సత్యనారాయణపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments