గర్భిణీ భార్యను భుజంపై 3 కిలోమీటర్లు మోశాడు.. కానీ అడవిలోనే ప్రసవం..

Webdunia
శనివారం, 18 జులై 2020 (13:23 IST)
మనదేశంలో కనీసం విద్యుత్, రోడ్డు సౌకర్యాలు లేని గ్రామాలు చాలానే వున్నాయి. అలాగే ఆదివాసీల పరిస్థితి మరింత దారుణంగా వుంది. ఆస్పత్రులు లేక గర్భిణీ మహిళలు ప్రాణాపాయ స్థితిలో కిలోమీటర్లు దూరం నడవాల్సిన పరిస్థితి ఇప్పటికీ వుంది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే భద్రాద్రిలో చోటుచేసుకుంది. 
 
తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రహదారి సౌకర్యం లేక.. అంబులెన్స్ వచ్చే పరిస్థితిలేక.. అడవిలోనే ఓ మహిళ ప్రసవించింది. చర్ల మండలంలోని కీకారణ్యమైన ఎర్రంపాడుకి చెందిన కొవ్వాసి ఐతే అనే నిండు గర్భిణీ... పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో.. కాలినడకలోనే ఎర్రంపాడు నుండి చెన్నారం వరకు మూడు కిలోమీటర్లు మోసుకెళ్లాడు ఆమె భర్త మాస, ఆయనకు ఆశా కార్యకర్త సోమమ్మ సహాయం చేసింది. ఇక, ఫోన్ సిగ్నల్ దొరకడంతో.. స్థానికుంగా ఉన్న యువకులు 108కి ఫోన్ చేశారు.
 
అయితే.. 108కి వచ్చేసరికే అడవిలోనే ప్రసవించి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఐతే.. ఇక, ఆ తర్వాత.. బాలింతను, శిశువును 108లో ప్రాథమిక చికిత్స తర్వాత.. సత్యనారాయణపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments