Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ భార్యను భుజంపై 3 కిలోమీటర్లు మోశాడు.. కానీ అడవిలోనే ప్రసవం..

Webdunia
శనివారం, 18 జులై 2020 (13:23 IST)
మనదేశంలో కనీసం విద్యుత్, రోడ్డు సౌకర్యాలు లేని గ్రామాలు చాలానే వున్నాయి. అలాగే ఆదివాసీల పరిస్థితి మరింత దారుణంగా వుంది. ఆస్పత్రులు లేక గర్భిణీ మహిళలు ప్రాణాపాయ స్థితిలో కిలోమీటర్లు దూరం నడవాల్సిన పరిస్థితి ఇప్పటికీ వుంది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే భద్రాద్రిలో చోటుచేసుకుంది. 
 
తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రహదారి సౌకర్యం లేక.. అంబులెన్స్ వచ్చే పరిస్థితిలేక.. అడవిలోనే ఓ మహిళ ప్రసవించింది. చర్ల మండలంలోని కీకారణ్యమైన ఎర్రంపాడుకి చెందిన కొవ్వాసి ఐతే అనే నిండు గర్భిణీ... పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో.. కాలినడకలోనే ఎర్రంపాడు నుండి చెన్నారం వరకు మూడు కిలోమీటర్లు మోసుకెళ్లాడు ఆమె భర్త మాస, ఆయనకు ఆశా కార్యకర్త సోమమ్మ సహాయం చేసింది. ఇక, ఫోన్ సిగ్నల్ దొరకడంతో.. స్థానికుంగా ఉన్న యువకులు 108కి ఫోన్ చేశారు.
 
అయితే.. 108కి వచ్చేసరికే అడవిలోనే ప్రసవించి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఐతే.. ఇక, ఆ తర్వాత.. బాలింతను, శిశువును 108లో ప్రాథమిక చికిత్స తర్వాత.. సత్యనారాయణపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments