Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెసిఆర్ షాక్.. కొండా సురేఖ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ ప్యాకేజీ...

మాజీ మంత్రి కొండా సురేష్ కుటుంబ సభ్యులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయమైంది. కొండా సురేఖ భర్త కొండా మురళిలు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిక

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (15:11 IST)
మాజీ మంత్రి కొండా సురేష్ కుటుంబ సభ్యులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయమైంది. కొండా సురేఖ భర్త కొండా మురళిలు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి వీరు అత్యంత సన్నిహితులు. ఆయన మరణం తరువాత కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తరువాత టిఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు కొండా సురేఖ. సురేఖ పార్టీలో చేరక ముందే టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీకు మంత్రి పదవి గ్యారంటీ అని హామీ ఇచ్చారు కెసిఆర్.
 
కానీ మూడేళ్ళవుతోంది. ఇప్పటివరకు ఆ ఊసే లేదు. కనీసం తరువాతన్నా వస్తుందన్న నమ్మకంలేకపోయింది. దీంతో కొన్నిరోజుల పాటు పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు కొండా సురేఖ. ఇప్పుడు ఏకంగా పార్టీనే మారాలన్న నిర్ణయానికి వచ్చేశారని సమాచారం. కొండా సురేఖ భర్త కొండా మురళి కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి మేమొస్తామంటూ చెప్పారని సమాచారం. 
 
అయితే కొన్ని షరతులను పెట్టింది కొండా కుటుంబం. కొండా సురేఖతో పాటు పరకాలలో తన కుమార్తెకు టిక్కెట్టు కావాలని కోరారట. అయితే ఏదో ఒక సీటు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవాలన్న నిర్ణయానికి కొండా సురేఖ వచ్చేసినట్లు చెప్పుకుంటున్నారు. సురేఖ కనుక హ్యాండిస్తే వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్‌కు పెద్ద దెబ్బే. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments