Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎం ఇంట్లో తాచుపాము... పట్టుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (11:18 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇంట్లోకి నల్ల తాచు పాము వచ్చింది. దీంతో ఆయన వణికిపోయారు. ఈ విషయం తెలుసుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది అక్కడకు వెళ్లి చాకచక్యంగా పట్టుకున్నారు. 
 
గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో ఐఏఎస్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అనేక మంది అధికారులు నివసిస్తున్నారు. అయితే, ఈ ఏరియాలో చెట్లు, చిన్నచిన్న నీటికుంటలు, గుట్టలు అధికంగా ఉండటంతో విషసర్పాలు తరచుగా కనిపిస్తున్నాయి. 
 
ఈ క్రమంలో గురువారం చీకటి పడిన తర్వాత సీఎస్ ఎస్కే జోషి ఇంటి వెనుకభాగంలో ఓ నల్లతాచు పాము వచ్చి పడగ విప్పి బుసలు కొట్టసాగింది. దీన్ని చూసిన జోషి కుటుంబ సభ్యులతో పాటు.. స్థానికులు భయంతో వణికిపోయారు. ఈలోగా విషయం తెలుసుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది అక్కడుక వెళ్లి.. తన వద్ద ఉన్న ఓ పరికరంతో దాన్ని బంధించి చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ పాముకు ఎలాంటి హాని తలపెట్టకుండా దూరంగా వదిలిపెట్టాల్సిందిగా పోలీసులను కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Robo Shankar: తమిళ నటుడు రోబో శంకర్ కన్నుమూత.. అసలేమైంది?

ఓజీ లేటెస్ట్ అప్‌డేట్... ప్రకాశ్ రాజ్ పోస్టర్ రిలీజ్

Vedika: హీరోయిన్ వేదిక అందమైన బీచ్ వైబ్ స్టిల్స్ తో అభ్యర్థిస్తోంది

Upendra : ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి ఉపేంద్ర స్పెషల్ పోస్టర్

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు.. దహనం చుట్టూ వివాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments