తెలంగాణ సీఎం ఇంట్లో తాచుపాము... పట్టుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (11:18 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇంట్లోకి నల్ల తాచు పాము వచ్చింది. దీంతో ఆయన వణికిపోయారు. ఈ విషయం తెలుసుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది అక్కడకు వెళ్లి చాకచక్యంగా పట్టుకున్నారు. 
 
గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో ఐఏఎస్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అనేక మంది అధికారులు నివసిస్తున్నారు. అయితే, ఈ ఏరియాలో చెట్లు, చిన్నచిన్న నీటికుంటలు, గుట్టలు అధికంగా ఉండటంతో విషసర్పాలు తరచుగా కనిపిస్తున్నాయి. 
 
ఈ క్రమంలో గురువారం చీకటి పడిన తర్వాత సీఎస్ ఎస్కే జోషి ఇంటి వెనుకభాగంలో ఓ నల్లతాచు పాము వచ్చి పడగ విప్పి బుసలు కొట్టసాగింది. దీన్ని చూసిన జోషి కుటుంబ సభ్యులతో పాటు.. స్థానికులు భయంతో వణికిపోయారు. ఈలోగా విషయం తెలుసుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది అక్కడుక వెళ్లి.. తన వద్ద ఉన్న ఓ పరికరంతో దాన్ని బంధించి చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ పాముకు ఎలాంటి హాని తలపెట్టకుండా దూరంగా వదిలిపెట్టాల్సిందిగా పోలీసులను కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments