Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు... ఎందుకు?

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (07:29 IST)
అన్నను, అన్న కూతురిని, తన సొంత కూతురిని చంపాడు. ఆపై తాను గొంతు కోసుకున్నాడు. అనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లాలో ముగ్గురు కుటుంబ సభ్యులను హత్య చేసిన నిందితుడు.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న దోమకొండ సమీపంలోని అటవీ ప్రాంతంలో భిక్కనూర్ మండలం జంగంపల్లికి చెందిన బందెల రవి.. తన అన్న బాలయ్య, బాలయ్య కూతురు లత, తన సొంత కూతురు చందనను శీతల పానీయంలో పురుగుల మందు కలిపి తాగించి... ఆపై గొంతు కోసి చంపేశాడు.

అనంతరం తాను కూడా గొంతు కోసుకుని సమీపంలోని గుండ్ల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్నటి నుంచి రవి కోసం గాలించినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఈరోజు చెరువులో మృత దేహం బయట పడింది. అన్న పెద్ద కూతురు దీప... తన భార్య తరఫు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇది తట్టుకోలేక పోయిన రవి పరువు హత్యలకు పాల్పడ్డాడు. ఒక్క ప్రేమ వివాహం నలుగురిని మింగేయడం గ్రామస్థులను కలిచి వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments