Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే.. నేనే సీఎం: షర్మిల

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (06:44 IST)
తెలంగాణలో వైఎస్ షర్మిల తన పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. పది ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో గురువారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించే సంకల్ప సభ వాల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. 
 
కాగా లక్ష మందితో సభ నిర్వహణకు షర్మిల బందం ఒకవైపు కసరత్తు చేస్తుంటే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం 6వేల మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మంజిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. అది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని సూచించారు.
 
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేననీ, తానే సీఎంనని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదన్నారు. టీఆర్‌ఎస్‌ చెబితేనో, బీజేపీ అడిగితేనో వచ్చినవాళ్లం కాదని అన్నారు. వైఎస్‌ మహా ప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టిన ఏప్రిల్‌ 9న తొలి అడుగు వేద్దామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments