Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే.. నేనే సీఎం: షర్మిల

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (06:44 IST)
తెలంగాణలో వైఎస్ షర్మిల తన పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. పది ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో గురువారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించే సంకల్ప సభ వాల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. 
 
కాగా లక్ష మందితో సభ నిర్వహణకు షర్మిల బందం ఒకవైపు కసరత్తు చేస్తుంటే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం 6వేల మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మంజిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. అది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని సూచించారు.
 
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేననీ, తానే సీఎంనని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదన్నారు. టీఆర్‌ఎస్‌ చెబితేనో, బీజేపీ అడిగితేనో వచ్చినవాళ్లం కాదని అన్నారు. వైఎస్‌ మహా ప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టిన ఏప్రిల్‌ 9న తొలి అడుగు వేద్దామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments