Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోకిరి ప్రేమ వేధింపులు - యువతి బలవన్మరణం

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (09:25 IST)
ఓ పోకిరి చేస్తున్న ప్రేమ వేధింపులు భరించలేక ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో 15 యేళ్ళ చిరు ప్రాయంలోనే అనంత లోకాలకు చేరుకుంది. ఈ విషాదకర సంఘటన ఖమ్మం గ్రామీణ మండలంలో చోటుచేసుకుంది. 
 
పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బడికి వెళ్లే దారిలోనే నివాసముండే సాయికృష్ణ(20) అనే యువకుడు ప్రేమించాలంటూ ఆమెను వేధిస్తుండేవాడు. దీంతో సదరు విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో యువకుడిని మందలించారు. 
 
అయినా ప్రవర్తనను మార్చుకోని సాయికృష్ణ ఈ నెల 9న బాలిక పాఠశాలకు వెళ్లి వస్తుండగా వెంటబడ్డాడు. ప్రేమించకుంటే చచ్చిపోతానంటూ బెదిరించాడు. మనస్తాపానికి గురైన ఆమె దారిలో కలిసిన బంధువులకు వేధింపుల విషయాన్ని చెప్పి ఇంటికి వెళ్లింది. 
 
ఆ సమయంలో కుటుంబసభ్యులు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లో ఉన్న పురుగుమందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించిన బంధువులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments