Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం గారూ.. కారుణ్య మరణం ప్రసాదించండి... పదేళ్ళ బాలుడు వినతి

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (18:40 IST)
హృదయాన్ని ఇట్టే కదిలించే ఘటన ఒకటి ఖమ్మం జిల్లాలో జరిగింది. తనకు కారుణ్య మరణం ప్రసాదించాలని పదేళ్ళ బాలుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని ప్రాధేయపడ్డాడు. తన అక్క, బావల వేధింపులు భరించలేక పోతున్నానని, అందువల్ల మెర్సీ కిల్లింగ్ చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన సాయి అనే బాలుడు సీఎం కేసీఆర్‌ను ఓ విజ్ఞప్తి చేశాడు. తన తండ్రి గోరింట్ల లక్ష్మీనారాయణ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి అనారోగ్యంతో మృతి చెందాడని, ఆ తర్వాత తల్లిని పాఠశాలలో అటెండర్‌గా నియమించారన్నారు.
 
కరోనా పేరుతో తన తల్లిని తన సోదరి, బావ చంపారని, అప్పటి నుంచి తన వద్ద ఉన్న డబ్బు, తల్లి ఉద్యోగం తన సోదరికి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం తాను అద్దె ఇంట్లోనే ఉంటున్నానని, అయితే తన సోదరి, బావ తనను బెదిరిస్తున్నారని తెలిపారు. వారిద్దరి వేధింపులు భరించలేక పోతున్నానని, అందవుల్ల తనకు కారుణ్య మరణం ప్రసాదించాలని ప్రాధేయపడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments