ఖమ్మంలో ఘరానా మోసం .. రూ.3.50 కోట్లకు కుచ్చుటోపి

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (12:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో ఘరానా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ మోసానికి పాల్పడింది కూడా ఒక కుటుంబమే. తమ చుట్టుపక్కల వారిని నమ్మంచి ఏకంగా రూ.3.50 కోట్లకు కుచ్చుటోపీ పెట్టి పత్తాలేకుండా పారిపోయారు. ఆ తర్వాత బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... ఇద్దరు మోసగాళ్లను అరెస్టు చేయగా, కీలక మహిళా సూత్రధారి మాత్రం పారిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడకు చెందిన పురాణం శివకుమారి ముగ్గురు కుమారులతో కలిసి ఖమ్మంలో నివసిస్తోంది. జిల్లాలోని కొన్ని సంస్థలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నట్టు చెప్పుకునేది. 
 
ఈ క్రమంలో వ్యాపారుల నుంచి కోట్ల రూపాయల విలువైన పెసలు, కందిపప్పు, బియ్యం తదితరాలను తీసుకునేది. అలాగే, నాలుగు రూపాయల వడ్డీ ఇస్తానని ఆశ చూపి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసింది.
 
వ్యాపారులను నమ్మించేందుకు తొలుత కొంత డబ్బులు చెల్లించేది. ఆ తర్వాత రేపు, మాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చింది. ఈ క్రమంలో రూ.70 లక్షలు ఇచ్చిన ఖమ్మం రూరల్ మండలానికి చెందిన మాలోతు సునీత మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలి కుమారులైన పురాణం శివ, పురాణం శంకర్‌లను ఆదివారం అరెస్టు చేశారు. కీలక నిందితురాలైన పురాణం శివకుమారి, పురాణం గోపీకృష్ణ పరారీలో ఉన్నారు. వీరిపై మొత్తం ఏడు చీటింగ్ కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments