Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ భవనంలా కేసీఆర్‌ బడి

Webdunia
శనివారం, 3 జులై 2021 (10:17 IST)
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తాను చదువుకున్న బడిని రాజ భవనంలా తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. పాఠశాల నుంచి జూనియర్‌ కాలేజీ వరకు ఒకేచోట ఉండేలా నిర్మించారు. దుబ్బాక పాఠశాలలో కేసీఆర్‌ ప్రాథమిక విద్య నుంచి 9వ తరగతి దాకా చదివారు.

సీఎం అయిన తర్వాత నూతన భవన నిర్మాణానికి తొలుత రూ.6 కోట్లు కేటాయించారు. తర్వాత నిధులను పెంచారు. ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల ఒకేచోట ఉండాలనే సంకల్పంతో 18,787 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తులతో నిర్మించారు. పాఠశాల కోసం 14 తరగతి గదులు, నాలుగు ప్రయోగశాలలు, ఒక ఆర్ట్స్‌ గది, కామన్‌ గది, ఒక స్టోర్‌ రూం, ప్రధానోపాధ్యాయుడి గది, మూడు సిబ్బంది గదులు ఉన్నాయి.
 
జూనియర్‌ కళాశాల కోసం 14 తరగతి గదులు, నాలుగు ల్యాబ్‌లు, స్పోర్ట్స్‌ రూం, గ్రంథాలయం, కంప్యూటర్‌ ల్యాబ్‌, ప్రిన్సిపాల్‌ గది, రెండు సిబ్బంది గదులు, ఒక సమావేశ మందిరం ఉన్నాయి. 250 మంది ఒకేసారి వినియోగించుకునేలా బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించారు.

పాఠశాల, కళాశాలలకు విడివిడిగా నీటి ట్యాంకులున్నాయి. ప్రత్యేక విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments