Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ భవనంలా కేసీఆర్‌ బడి

Webdunia
శనివారం, 3 జులై 2021 (10:17 IST)
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తాను చదువుకున్న బడిని రాజ భవనంలా తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. పాఠశాల నుంచి జూనియర్‌ కాలేజీ వరకు ఒకేచోట ఉండేలా నిర్మించారు. దుబ్బాక పాఠశాలలో కేసీఆర్‌ ప్రాథమిక విద్య నుంచి 9వ తరగతి దాకా చదివారు.

సీఎం అయిన తర్వాత నూతన భవన నిర్మాణానికి తొలుత రూ.6 కోట్లు కేటాయించారు. తర్వాత నిధులను పెంచారు. ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల ఒకేచోట ఉండాలనే సంకల్పంతో 18,787 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తులతో నిర్మించారు. పాఠశాల కోసం 14 తరగతి గదులు, నాలుగు ప్రయోగశాలలు, ఒక ఆర్ట్స్‌ గది, కామన్‌ గది, ఒక స్టోర్‌ రూం, ప్రధానోపాధ్యాయుడి గది, మూడు సిబ్బంది గదులు ఉన్నాయి.
 
జూనియర్‌ కళాశాల కోసం 14 తరగతి గదులు, నాలుగు ల్యాబ్‌లు, స్పోర్ట్స్‌ రూం, గ్రంథాలయం, కంప్యూటర్‌ ల్యాబ్‌, ప్రిన్సిపాల్‌ గది, రెండు సిబ్బంది గదులు, ఒక సమావేశ మందిరం ఉన్నాయి. 250 మంది ఒకేసారి వినియోగించుకునేలా బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించారు.

పాఠశాల, కళాశాలలకు విడివిడిగా నీటి ట్యాంకులున్నాయి. ప్రత్యేక విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments