రాజ భవనంలా కేసీఆర్‌ బడి

Webdunia
శనివారం, 3 జులై 2021 (10:17 IST)
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తాను చదువుకున్న బడిని రాజ భవనంలా తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. పాఠశాల నుంచి జూనియర్‌ కాలేజీ వరకు ఒకేచోట ఉండేలా నిర్మించారు. దుబ్బాక పాఠశాలలో కేసీఆర్‌ ప్రాథమిక విద్య నుంచి 9వ తరగతి దాకా చదివారు.

సీఎం అయిన తర్వాత నూతన భవన నిర్మాణానికి తొలుత రూ.6 కోట్లు కేటాయించారు. తర్వాత నిధులను పెంచారు. ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల ఒకేచోట ఉండాలనే సంకల్పంతో 18,787 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తులతో నిర్మించారు. పాఠశాల కోసం 14 తరగతి గదులు, నాలుగు ప్రయోగశాలలు, ఒక ఆర్ట్స్‌ గది, కామన్‌ గది, ఒక స్టోర్‌ రూం, ప్రధానోపాధ్యాయుడి గది, మూడు సిబ్బంది గదులు ఉన్నాయి.
 
జూనియర్‌ కళాశాల కోసం 14 తరగతి గదులు, నాలుగు ల్యాబ్‌లు, స్పోర్ట్స్‌ రూం, గ్రంథాలయం, కంప్యూటర్‌ ల్యాబ్‌, ప్రిన్సిపాల్‌ గది, రెండు సిబ్బంది గదులు, ఒక సమావేశ మందిరం ఉన్నాయి. 250 మంది ఒకేసారి వినియోగించుకునేలా బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించారు.

పాఠశాల, కళాశాలలకు విడివిడిగా నీటి ట్యాంకులున్నాయి. ప్రత్యేక విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ లాంటి పర్సన్ మహిళలకు బ్లెస్సింగ్ అనుకోవాలి : రశ్మిక మందన్న

రష్మిక కోసం వచ్చిన మహిళా అభిమాని.. బౌన్సర్ తోసేయడానికి ప్రయత్నిస్తే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments