Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడు ఉప ఎన్నికల పోరు : సీఎం కేసీఆర్ మూడు రోజుల మకాం

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (12:05 IST)
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే నెల 3వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నిక కోసం అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. అధికార తెరాస, బీజేపీ, కాంగ్రెస్, ప్రజాశాంతి పార్టీలతో వివిధ పార్టీల అభ్యర్థుల తరపున ఆయా పార్టీ నేతలు, మంత్రులు, పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఇప్పటివరకు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరానికి తిరిగివచ్చారు. ఆయన ఇపుడు పూర్తి స్థాయిలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికపై దృష్టిసారించారు. తెరాస అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నారు. అంతేకాకుండా, మూడు రోజుల పాటు మునుగోడులోనే ఆయన మకాం వేయబోతున్నారు. 
 
ఈ నెల 29, 30, 31వ తేదీల్లో ఆయన మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మునుగోడులో రోడ్ షోలు నిర్వహిస్తారు. 31వ తేదీన స్థానికంగా జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కాగా, ఈ ఎన్నికలకు నవంబరు ఒకటో తేదీతో ప్రచారం ముగియనుంది. మూడో తేదీన పోలింగ్ నిర్వహించి, ఆరో తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు. 

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments