Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడు ఉప ఎన్నికల పోరు : సీఎం కేసీఆర్ మూడు రోజుల మకాం

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (12:05 IST)
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే నెల 3వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నిక కోసం అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. అధికార తెరాస, బీజేపీ, కాంగ్రెస్, ప్రజాశాంతి పార్టీలతో వివిధ పార్టీల అభ్యర్థుల తరపున ఆయా పార్టీ నేతలు, మంత్రులు, పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఇప్పటివరకు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరానికి తిరిగివచ్చారు. ఆయన ఇపుడు పూర్తి స్థాయిలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికపై దృష్టిసారించారు. తెరాస అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నారు. అంతేకాకుండా, మూడు రోజుల పాటు మునుగోడులోనే ఆయన మకాం వేయబోతున్నారు. 
 
ఈ నెల 29, 30, 31వ తేదీల్లో ఆయన మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మునుగోడులో రోడ్ షోలు నిర్వహిస్తారు. 31వ తేదీన స్థానికంగా జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కాగా, ఈ ఎన్నికలకు నవంబరు ఒకటో తేదీతో ప్రచారం ముగియనుంది. మూడో తేదీన పోలింగ్ నిర్వహించి, ఆరో తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments