Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ శ్రేణులతో సీఎం కేసీఆర్ భేటీ: 19 నుంచి సీఎం జిల్లాల పర్యటన

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (11:27 IST)
పార్టీ శ్రేణులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రమంతా దళిత బంధు అమలుచేస్తామని.. మొదట ప్రతి నియోజకవర్గంలో వంద మందికి ఇస్తామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. పంటల మార్పిడిపై రైతులను చైతన్య పరచాలని.. మిల్లర్లతో టై అప్ ఉన్నోళ్లు వరి వేసుకోనివ్వాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు యథావిధిగా ఇస్తామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఇంకా కొనసాగుతోంది.
 
ఇక శనివారం మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నెల 19 నుంచి సీఎం జిల్లాల పర్యటనలు చేయనున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం… శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే ద్విముఖ వ్యూహంతో కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది
 
కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఉద్ధృతం చేసేందుకు టీఆర్‌ఎస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం పార్టీ శ్రేణులందరితో సీఎం కీలకభేటీ నిర్వహించారు. పార్టీ మీటింగ్‌లో సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. చురుగ్గా పని చేయాలని, ఎమ్మెల్యేలను, ఎంపీలను మళ్లీ గెలిపించే బాధ్యత తనదేనని చెప్పారు. నాయకులకు ఓపిక ఉండాలని, పార్టీ కోసం కష్టపడ్డోళ్లకు పదవులు వస్తాయని స్పష్టం చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 AD చిత్రం సామాన్య ప్రేక్షకులను అలరిస్తుందా? రివ్యూ రిపోర్ట్

ప్రభాస్ "కల్కి" అవతారం విరామం వరకు ఎలా ఉందంటే...

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments