Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ.. మహిళా రిజర్వేషన్ బిల్లుతో..?

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (23:41 IST)
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. 33 శాతం బీసీ రిజర్వేషన్‌ బిల్లుతో సహా 33 శాతం మహిళా
రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ రెండు బిల్లులను సభ ముందుకు తీసుకురావాలన్నారు. 
 
శుక్రవారం ప్రగతి భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశంలో ఈ అంశంపై ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. 
 
ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బీసీ (ఓబీసీ) బిల్లు, మహిళా బిల్లు ఈ రెండు బిల్లుల ప్రవేశానికి బీఆర్‌ఎస్ ఎంపీలు చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై పార్లమెంటరీ పార్టీ సుదీర్ఘంగా చర్చించింది.
 
మహిళల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ కట్టుబడి ఉందని, బీసీల అభ్యున్నతి కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ కట్టుబడి ఉందని, దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ హక్కులను ఎప్పటికప్పుడు కేంద్రానికి వినిపిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 
 
ఈ దిశగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యసభ, లోక్‌సభలో ఎంపీలు పార్టీ డిమాండ్లను లేవనెత్తాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments