Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం... 100 నియోజకవర్గాలు గెలిచి వస్తా.. కేసీఆర్

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (16:08 IST)
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తరువాత  స్వామివారి ముందు నామినేషన్ పత్రాలు పెట్టి ప్రార్థించారు. మంత్రి హరీష్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 
 
రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి వంద సీట్లు దక్కేలా ఓటు వేయాలని ప్రజలను కోరారు. సిద్దిపేట నుండి హరీష్ రావు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.... దేశంలోనే సంపన్న రైతులు ఎక్కడ ఉన్నారు అంటే తెలంగాణలో అనే విధంగా రైతాంగాన్ని అభివృద్ధి చేసి తీరుతానని హామీ ఇచ్చారు.
 
ప్రతి రాజకీయ అడుగులో ఈ ప్రాంతం నాకు అండగా నిలిచింది. ఇక్కడి వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం లేనిది ఎప్పుడు ముందుకు వెళ్ళలేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సిద్ధిపేటను విడిచి వెళ్లాల్సి వచ్చింది. రాజకీయ యుద్ధంలోకి దిగబోతున్నాను. 100 నియోజకవర్గాల్లో విజయం సాధించి మళ్ళీ మీ ముందుకు వస్తానని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో కోసం గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్యం వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments