Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనగామలో కేసీఆర్ టూర్-తగ్గేదేలే.. ఇది కేసీఆర్ అడ్డా.. అంటూ..

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (12:56 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభమైంది. ప్రధాని మోదీ పార్లమెంటులో విభజనపై మాట్లాడటం, ఆ తర్వాత టీఆర్ఎస్ నిరసనలు వ్యక్తం చేయడంతో తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. మోదీపై టీఆర్ఎస్ నేతలు మండిపడటం, వారికి బీజేపీ కౌంటర్ ఇస్తుండటంతో జనగామ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. 
 
ఇక ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్.. ముందుగా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చించనున్నారు. 
 
అధికారులతో సమీక్ష అనంతరం భోజనం చేసి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జనగామ జిల్లా మోడల్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, అనంతరం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
 
అనంతరం సమీపంలోని మైదానంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా జనగామ పట్టణాన్ని టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండాలతో నింపేశారు.
 
కేసీఆర్ సభ జరిగే మైదానంలో "తగ్గేదేలే.. ఇది కేసీఆర్ అడ్డా" అనే క్యాప్షన్‌తో ఏర్పాటుచేసిన భారీ బెలూన్ ప్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సభకు సుమారు లక్షా 30 వేల మంది సభకు హాజరు కానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments