Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ గారూ మీరు ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి: తమ్మినేని వీరభద్రం

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (18:18 IST)
కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధులు, బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో ఉపేక్షించవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. కరీంనగర్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాలకు సిద్దంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
 
కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఉద్యమిస్తే ఆయనకు తాము బాసటగా నిలుస్తామని తెలిపారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రానికి సమకూర్చాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం అప్పులు తీసుకోవాలని చెబుతుండటం దారుణమని ఆయన తెలిపారు.
 
జీఎస్టీ వల్ల రాష్ట్రం వేల కోట్లు నష్టపోయిందని ఆయన వివరించారు. ఎల్ఆర్ఎస్ నుండి సామాన్యులను మినహాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడంపై అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని తమ్మినేని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments