Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ గారూ మీరు ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి: తమ్మినేని వీరభద్రం

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (18:18 IST)
కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధులు, బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో ఉపేక్షించవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. కరీంనగర్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాలకు సిద్దంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
 
కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఉద్యమిస్తే ఆయనకు తాము బాసటగా నిలుస్తామని తెలిపారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రానికి సమకూర్చాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం అప్పులు తీసుకోవాలని చెబుతుండటం దారుణమని ఆయన తెలిపారు.
 
జీఎస్టీ వల్ల రాష్ట్రం వేల కోట్లు నష్టపోయిందని ఆయన వివరించారు. ఎల్ఆర్ఎస్ నుండి సామాన్యులను మినహాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడంపై అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని తమ్మినేని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments