టీఆర్ఎర్ సర్కారుపై కిషన్ రెడ్డి ఫైర్..

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (16:41 IST)
తెలంగాణ సర్కారుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పంజాబ్‌లో ఏటా ఒక్కసారి మాత్రమే ధాన్యం వస్తుందన్నారు.. అయితే ఏపీకి లేని సమస్య తెలంగాణకు మాత్రమే ఎందుకొస్తుందంటూ ప్రశ్నించారు. 
 
ఏ రైతు కూడా బాయిల్డ్ రైస్ పండించడు.. మిల్లింగ్‌లోనే అది బాయిల్డ్‌ రైస్‌గా మారుతుంది.. మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో లేని సమస్య తెలంగాణకు ఎందుకు వస్తుందన్నారు.
 
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తే జాలేస్తుందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయ చదరంగంలో రైతుల్ని బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి అధికారం నిలబెట్టుకోవడానికి రైతులను కేసీఆర్ బలి చేస్తున్నారని విమర్శించారు. కొడుకుకు అధికారం ఇచ్చేందుకు జరిగే ప్రయత్నాల్లో బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు.  
 
బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ హెలికాఫ్టర్లు వేసుకొని దేశమంతా తిరుగుతున్నారని విమర్శించారు కిషన్‌రెడ్డి. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా 4 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచామని రేపు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments