Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిడ్ డే మీల్స్ వికటించింది .. 80 మంది విద్యార్థులకు అస్వస్థత

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (11:34 IST)
తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం వికటించింది. ఫలితంగా 80 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. బీర్కూర్‌ మండల కేం ద్రంలో బుధవారం చోటు చేసుకుంది. 
 
స్థానిక ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో రోజూ మాదిరిగానే 321 విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కొక్కరికి వాంతులు, కడుపునొప్పి ప్రా రంభమైంది. దీంతో ఉపాధ్యాయులు ఈ విషయం బయటికి పొక్కకుండా ప్రయత్నించారు. 
 
పరిస్థితి చేయిదాటి పోతుండడంతో మండల వైద్యాధికారికి రాజారమేశ్‌కు సమాచారం అందించారు. సిబ్బందితో అక్కడి చేరుకున్న ఆయన విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు. విద్యార్థులంతా చికిత్స పొందుతున్నారని తహసీల్దార్‌ రాజు తెలిపారు.
 
ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఎస్సై రాజేశ్‌, రైతు బంధు సమితి అధ్యక్షుడు అవారి గంగారాం పాఠశాలకు చేరుకొని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు చేరుకున్న డీఎంహెచ్‌వో కల్పన భోజనం శాంపిళ్లను సేకరించాలని మండల వైద్యాధికారిని ఆదేశించారు. శాంపిళ్లను ల్యాబ్‌కు పంపిన తర్వాతే కారణాలు తెలుస్తాయన్నారు. బాధిత చిన్నారులను తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆస్పత్రికెళ్లి పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments